- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
T- TDP మీడియా కో-ఆర్డినేటర్గా బియ్యని సురేష్
దిశ, తెలంగాణ బ్యూరో: టీ -డీపీ తెలంగాణ రాష్ట్ర మీడియా వ్యవహారాల కో-ఆర్డినేటర్గా బియ్యని సురేష్ నియమితులయ్యారు. మంగళవారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ నియామక ఉత్తర్వులను అందజేశారు. భువనగిరి పార్లమెంటు పరిధిలోని ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన సురేష్ సీనియర్ జర్నలిస్ట్, న్యాయవాదిగా పనిచేస్తున్నారు. గత 25 ఏళ్లుగా పలు పత్రికా సంస్థల్లో విధులు నిర్వర్తించారు. విద్యార్థి దశలోనే ఎస్ఎఫ్ఐ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కార్యదర్శిగా కొనసాగారు. 2004లో వైఎస్ సర్కారు హయాంలో చిన్న నీటిపారుదల శాఖ మంత్రి వద్ద పీఆర్వోగా, 2017 తర్వాత టీఎస్ ఐఐసీ చైర్మన్ పీఆర్వో గా విధులు నిర్వర్తించారు. ఈ సందర్భంగా సురేష్ మీడియాతో మాట్లాడుతూ మీడియా కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించిన పార్టీ అధ్యక్షుడు కాసానికి కృతజ్ఞతలు తెలిపారు. అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్థానని పేర్కొన్నారు. పార్టీ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.