బిగ్ బ్రేకింగ్ : పుష్ప డైరెక్టర్ ఇంట్లో ఐటీ రైడ్స్!

by Disha Web Desk 4 |
బిగ్ బ్రేకింగ్ : పుష్ప డైరెక్టర్ ఇంట్లో ఐటీ రైడ్స్!
X

దిశ, డైనమిక్ బ్యూరో : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్‌కు ఊహించని షాక్‌ తగిలింది. బుధవారం సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు. జీఎస్టీ సరిగా కట్టలేదనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే..సుకుమార్ ఇంట్లో తాజాగా ఐటీ రైడ్స్ జరుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అధికారులు పలు విషయాలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇక అటు మైత్రి మూవీ మేకర్స్ ఆఫీసులోను ఇవాళ ఈడీ సోదాలు చేస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ దాదాపు రూ.700 కోట్ల వరకు వివిధ రూపాల్లో నగదు సమకూర్చుకుని జీఎస్టీ సరిగా కట్టలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలోనే మైత్రి మూవీ మేకర్స్ ఆఫీసులో ఈడీ సోదాలు చేస్తోంది. దీంతో పుష్ప షూటింగ్ రద్దైంది. అయితే మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్‌ కాంబోలో ఇప్పుడు పుష్ప 2 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

Read more:

YS Viveka Case : ఆరు రోజుల పాటు ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ

Next Story

Most Viewed