BIG BREAKING: వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థకే మొగ్గు చూపుతున్న ప్రభుత్వం

by Disha Web Desk 1 |
BIG BREAKING: వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థకే మొగ్గు చూపుతున్న ప్రభుత్వం
X

దిశ, వెబ్ డెస్క్: రెవెన్యూ శాఖ ప్రక్షళనలో భాగంగా కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వీఆర్వోల దగ్గరి నుంచి రికార్డులు స్వాధీనం చేసుకునే పనిని కలెక్టర్లకు కూడా అప్పగించింది. కానీ, ఇటీవల ఎన్నికల్లో ప్రజామోదంతో పదేళ్ల సుధీర్ఘ విరామం తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మళ్లీ వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరించే ఆలోచనలో సర్కార్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ భూములను కాపాడడంలో వీఆర్వోల పాత్ర కీలకమని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులతో అన్నట్లుగా సమాచారం.

ఈ క్రమంలోనే సీఎం వాఖ్యలకు బలం చేకూర్చుతూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి ప్రతి గ్రామంలో ఓ రెవెన్యూ ఉద్యోగి ఉంటారని పేర్కొన్నారు. ఈ మొత్తం పరిణామాలతో రెవెన్యూ శాఖ ఉనికి కోల్పోకుండా మళ్లీ వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరించే అవకాశమే కనిపిస్తోందనే టాక్ వినిపిస్తోంది. ధరణి అందుబాటులోకి వచ్చిన తరువాత వీఏవో, వీఆర్వోలను గత ప్రభుత్వం ఇతర శాఖాలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో వారిలో తిరిగి విధుల్లోకి తీసుకుంటారో, లేక ప్రత్యేకంగా కొత్తగా వీఆర్వోల నియామిస్తారా అనేది హాట్ టాపిక్‌‌‌గా మారింది.



Next Story

Most Viewed