పర్యాటకులకు బిగ్ అలర్ట్.. శ్రీశైలం గేట్లు మూసివేత

by Malleboina Mahesh |

ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు నిండుకుండలా మారిపోయాయి.

పర్యాటకులకు బిగ్ అలర్ట్.. శ్రీశైలం గేట్లు మూసివేత
X

దిశ, వెబ్ డెస్క్: ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా కృష్ణా నది (Krishna river)పై ఉన్న ప్రాజెక్టులు నిండుకుండలా మారిపోయాయి. ఈ క్రమంలో జూరాల, శ్రీశైలం జలాశయం (Srisailam Reservoir) గేట్లను ఎత్తిన అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు. అయితే ప్రస్తుతం వరద ఉధృతి (Flood surge) పూర్తిగా తగ్గిపోవడంతో అప్రమత్తమైన అధికారులు ఈ రోజు ఉదయం శ్రీశైలం గేట్లను మూసివేశారు. ఈ నెల 8న సీఎం చంద్రబాబు, మంత్రి నిమ్మల రామానాయుడు గంగా హారతి చేసిన తర్వాత అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. అయితే ఈ నెల 12 వరద ఉధృతి తగ్గడంతో మూడు గేట్లను మూసేసిన అధికారులు కేవలం ఒక్క గేటును తెరిచి ఉంచి నీటిని వదిలారు. అయితే ఈ రోజు తెల్లవారుజామున ఎగువ నుంచి వరద ఉధృతి పూర్తిగా తగ్గిపోవడంతో అధికారులు ఒక్క గేటును కూడా మూసివేశారు. ప్రస్తుతం కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతుంది.

Next Story