- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గిరిజనుల మధ్య అపోహలు.. నిజ నిర్ధారణ కమిషన్ వేయాలి.. డీజీపీకి బంజారా మహా సేవా సంఘం విజ్ఞప్తి
రాష్ట్రంలోని గోండు, కోయ, బంజారా లంబాడీ గిరిజనుల మధ్య నెలకొన్న అపోహాలు, అపార్థాలను తొలగించడానికి ప్రభుత్వ నిజనిర్ధారణ కమిషన్నియమించి గిరిజనుల మధ్య విభేదాలు తొలగించాలి

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని గోండు, కోయ, బంజారా లంబాడీ గిరిజనుల మధ్య నెలకొన్న అపోహాలు, అపార్థాలను తొలగించడానికి ప్రభుత్వ నిజనిర్ధారణ కమిషన్నియమించి గిరిజనుల మధ్య విభేదాలు తొలగించాలని బంజారా భారత్ అఖిల భారతీయ బంజారా మహా సేవా సంఘం కోరింది. ఈ మేరకు సంఘం ప్రతినిధులు మంగళవారం హైదరాబాద్లో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి(Telangana DGP Shivdhar Reddy)కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘ వ్యవస్థాపకులు, మాజీ ఎంపీ ధరావత్ రవీంద్ర నాయక్ మాట్లాడుతూ.. ఇటీవల కొన్ని సోషల్ మీడియా, తదితర మాధ్యమాల్లో బంజారా లంబాడీలు గిరిజనులు కాదన్నట్లుగా చిత్రీకరించి గిరిజనుల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. గిరిజనులకు కేటాయించిన 10 శాతం రిజర్వేషన్లలో కేవలం 4 శాతమే అమలవుతుందని, పూర్తిగా అమలే కానప్పుడు బంజారా లంబాడీలు ఎక్కువ రిజర్వేషన్లు పొందుతున్నారంటూ కుట్ర చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనుల మధ్య సామరస్య సద్భావన నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిజనిర్ధారణ కమిషన్ ఏర్పాటు చేయాలని రవీంద్ర నాయక్ విజ్ఙప్తి చేశారు. రాష్ట్రాభివృద్ధిలో బంజారా లంబాడీలను భాగస్వాములను చేయాలని ఆయన కోరారు.






