- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండియా vs పాకిస్తాన్ మధ్య కబడ్డీ మొదలైంది: బండి సంజయ్
by Gantepaka Srikanth |
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్డెస్క్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్లో కబడ్డీ ఆట మొదలైందని చెప్పారు. ఇండియా పేరుతో బీజేపీ, పాకిస్తాన్ పేరుతో ఎంఐఎం/కాంగ్రెస్ పార్టీల మధ్య మ్యాచ్ ఉండబోతోందని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, ఎంఐఎం మధ్య రూ.100 కోట్ల డీల్(మ్యాచ్ ఫిక్సింగ్) కుదిరిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ డబ్బుతో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. కరీంనగర్లోని మీడియా, సోషల్ మీడియాసహా యువకులంతా కుల, మతాలకు అతీతంగా ఒక్కటై కాంగ్రెస్, ఎంఐఎం చేస్తున్న కుట్రలను వివరించాలని పిలుపునిచ్చారు. ‘కరీంనగర్కు రక్షణ కవచంగా నేనుంటా. కరీంనగర్లో కాంగ్రెస్, ఎంఐఎం కుట్రలకు తగిన బుద్ధి చెప్పండి’ అని బండి కోరారు.
Next Story






