- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
‘కేసీఆర్ను ఎందుకు భరించాలి.. ఎందుకు సహించాలి’
దిశ, తెలంగాణ బ్యూరో: పార్టీ పేరు నుంచి తెలంగాణ అనే పదాన్ని తొలగించి తెలంగాణ సెంటిమెంట్నే లేకుండా సీఎం కేసీఆర్ చేశారని, ఆయన తెలంగాణ పదాన్ని తొలగించినట్లే ఆయన్ను కూడా ప్రజలు రాష్ట్రం నుంచి ఎందుకు తొలగించవద్దో చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గురువారం ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఉద్యమకారులకు పార్టీలో చోటివ్వడని, దళితులకు మూడెకరాలు ఇవ్వడని, వారికి ముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వని వ్యక్తి కేసీఆర్ అని ఆయన ఫైరయ్యారు. రాష్ట్రంలో ఖాళీలు భర్తీ చేయాల్సి ఉన్నప్పటికీ రిక్రూట్ చేయకుండా పేపర్ లీకేజీలు చేస్తున్నాడని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ అని ఫైరయ్యారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, దళితబంధు, పంచాయతీ, మున్సిపాలిటీలకు నిధులు, ప్రకటనలే తప్ప ఆలయాలకు సైతం నిధులు ఇవ్వని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సీఎం కేసీఆర్ మాత్రమేనని బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి తన ప్రధాన బాధ్యతల్లో ప్రజలకు చోటివ్వన్నప్పుడు ప్రజలు మాత్రం అతడిని ఎందుకు భరించాలని సంజయ్ ప్రశ్నించారు. ఎందుకు సహించాలో సీఎం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.