కాంగ్రెస్ గెలుపుతో రాహుల్ గాంధీ ప్రధాని : రంజిత్ రెడ్డి

by Disha Web Desk 11 |
కాంగ్రెస్ గెలుపుతో రాహుల్ గాంధీ ప్రధాని : రంజిత్ రెడ్డి
X

దిశ, చేవెళ్ల : కాంగ్రెస్ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. శంకర్పల్లి మండలంలోని మహాలింగాపురం గ్రామానికి చెందిన పలువురు మైనార్టీలు చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ ఆధ్వర్యంలో శుక్రవారం శంకర్ పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రంజిత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఆయన కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…

ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తున్నదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పనిసరిగా ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతారు, అందులో ఎలాంటి సందేహాలకు తావు లేదు అన్నారు. కాంగ్రెస్ ను భారీ మెజార్టీతో గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానిగా చూద్దామని ఆశాభావం వ్యక్తం చేశారు. చేవెళ్ల నియోజకవర్గ ఇన్చార్జి భీమ్ భరత్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని,ఆయన నాయకత్వంలో పార్టీ మరింతగా అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు.

భీమ్ భరత్ నాయకత్వంలో నాయకులు కార్యకర్తలు మరింత ఉత్సాహంతో పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీసీసీ కార్యదర్శి ఉదయ మోహన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు ప్రకాష్, మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి , కౌన్సిలర్ చంద్రమౌళి, శ్రీనాథ్ గౌడ్, సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి, ఎజాస్, రాజు గౌడ్, బద్దం చిన్న కృష్ణారెడ్డి, శ్రీశైలం,రామచందర్, ప్రవీణ్ కుమార్, పాండురంగారెడ్డి, మడ పతి ప్రవీణ్, రఘునందన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed