అయోధ్య జ్ఞాపకాలను నెమరువేసుకున్న బండి సంజయ్.. ఎమోషనల్ ట్వీట్ వైరల్

by Disha Web Desk 1 |
అయోధ్య జ్ఞాపకాలను నెమరువేసుకున్న బండి సంజయ్.. ఎమోషనల్ ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్ : అయోధ్య రామ మందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్టకు సమయం ఆసన్నమైంది. దేశ వ్యాప్తంగా కుల, మత బేధాలు లేకుండా రేపు అట్టహాసంగా జరగబోతున్న ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని వీక్షించేందుకు అందరూ వేయి కన్నులతో వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ X (ట్విట్టర్) వేదికగా తన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తాను బాబ్రీ మసీదు వద్ద కరసేవలో పాల్గొన్నప్పటి ఫొటోలను షేర్ చేస్తూ.. ‘రేపు హిందువులందరికీ పెద్ద రోజు, అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్టకు సిద్ధమవుతున్న తరుణంలో, అక్కడ నేను కరసేవలో పాల్గొంటున్నాను. ‘మందిర్ వహీ బనేగా’ నుంచి ‘మందిర్ బంగాయా హై’ వరకు మేము చాలా దూరం వచ్చాం. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని చూసేందుకు నేను బతికే ఉన్నానని నా హృదయం ఆనందంతో నిండిపోయింది’ అంటూ X(ట్విట్టర్)‌లో తన జ్ఞాపకాలను షేర్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story

Most Viewed