కార్పొరేట్ విద్యాసంస్థల వెనకున్న ఆ బడా బాబులను వదిలి పెట్టం: బండి సంజయ్ వార్నింగ్

by Disha Web Desk 19 |
కార్పొరేట్ విద్యాసంస్థల వెనకున్న ఆ బడా బాబులను వదిలి పెట్టం: బండి సంజయ్ వార్నింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: నార్సింగిలోని చైతన్య కళాశాల ఘాతుకానికి బలైన విద్యార్థి సాత్విక్ తల్లిదండ్రులకు తానున్నానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భరోసా కల్పించారు. సాత్విక్ చనిపోయినందుకు చాలా బాధగా ఉందని, న్యాయం జరిగేలా చూస్తానని, ధైర్యంగా ఉండాలని బండి సంజయ్ సాత్విక్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి హామీ ఇచ్చారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న బడా బాబుల భరతం పడతానని, కార్పొరేట్ విద్యాసంస్థల వెనకున్న పెద్ద మనుషులను వదిలిపెట్టబోమని బండి సంజయ్ హెచ్చరించారు.

కాగా తమ కుమారుడు సాత్విక్ ప్రాణాన్ని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని తల్లిదండ్రులు బండి సంజయ్‌తో వాపోయారు. తన కుమారుడికి పట్టిన గతి మరో విద్యార్థికి జరగకుండా కళాశాల యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని బండి సంజయ్‌ను కోరారు. కాగా ఈ కేసును ఇంతటితో వదిలేది లేదని, అవసరమైతే సాత్విక్ కేసుకు సంబంధించి బీజేపీ లీగల్ సెల్ అండగా ఉండి న్యాయ పోరాటం చేస్తుందని వారికి బండి హామీ ఇచ్చారు. సాత్విక్ కుటుంబానికి అన్ని విధాలుగా సహాయ సహకారం అందించాలని స్థానిక నేత ఏపీ మిథున్ రెడ్డిని బండి సంజయ్ ఆదేశించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story