చిప్పలు కడిగే నిన్ను మంత్రిని చేసింది ప్రజలే.. కేటీఆర్‌పై బండి సంజయ్ సీరియస్

by Disha Web Desk 19 |
చిప్పలు కడిగే నిన్ను మంత్రిని చేసింది ప్రజలే.. కేటీఆర్‌పై బండి సంజయ్ సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రజల కంటే ఆంధ్రవాళ్లు తెలివైనవారని బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సీరియస్ అయ్యారు. అమెరికాలో చిప్పలు కడిగే కేటీఆర్‌ను మంత్రిని చేసింది తెలంగాణ ప్రజలేనని కౌంటర్ ఇచ్చారు. అలాంటి తెలంగాణ ప్రజలకు తెలివి లేదు అంటావా అని కేటీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలివి లేకనే తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం నడిపారా అని ప్రశ్నించారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ ప్రజలు ఎవరూ బీఆర్ఎస్‌కు ఓట్లేయద్దని బండి పిలుపునిచ్చారు. మాలో తెలంగాణ రక్తం, పౌరుషం ఉందని.. మనకు తెలివి లేదని అన్నవాళ్లకు ఓటు వేయొద్దని కోరారు.


Next Story