Bandi Sanjay: బండి సంజయ్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట

by Prasad Jukanti |

తెలంగాణ బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు.

Bandi Sanjay: బండి సంజయ్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ బీజేపీ నేతలు (T BJP) హైకోర్టును ఆశ్రయించారు. గతంలో నమోదైన కేసులను కొట్టివేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay), ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యే హరీశ్ బాబు పిటిషన్లు దాఖలు చేశారు. వేర్వేర్ కేసుల్లో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఈ పిటిషన్లపై ఇవాళ విచారణ జరిపింది. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే హరీశ్ బాబుకు కింది కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. తదుపరి విచారణ వచ్చేనెల 17కు వాయిదా వేసింది. ఎంపీ లక్ష్మణ్ కేసులను వేరే బెంచ్ ముందు ఉంచాలని రిజిస్ట్రికి జడ్జీ సూచించారు.

Next Story