మేము పోరాటం చేస్తే కాంగ్రెస్ అధికారం అనుభవిస్తుంది: బండి సంజయ్

by Disha Web Desk 2 |
మేము పోరాటం చేస్తే కాంగ్రెస్ అధికారం అనుభవిస్తుంది: బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: తాము పోరాటం చేసి కేసీఆర్ సర్కార్‌ను కూల్చితే కాంగ్రెస్ నేతలు అధికారం అనుభవిస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ఆచరణకు సాధ్యం కాని హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఎద్దేవా చేశారు. నాలుగు నెలల పాలన చూశాక కాంగ్రెస్‌కు ఓటేసినందుకు ప్రజలు బాధ పడుతున్నారని అన్నారు. కేసీఆర్, కేటీఆర్‌తో కాంగ్రెస్‌ నేతలకు దోస్తీ ఉందని అన్నారు. ఢిల్లీకి పంపడానికి డబ్బులు ఉన్నాయి కానీ, రైతులకు బోనస్ ఇవ్వడానికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మళ్లీ దళారుల వ్యవస్థ ప్రారంభమైందని సీరియస్ అయ్యారు.

Next Story

Most Viewed