నన్నెలా మరిచారు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీరుపై దత్తాత్రేయ ఆగ్రహం!

by Disha Web Desk 19 |
నన్నెలా మరిచారు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీరుపై దత్తాత్రేయ ఆగ్రహం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీరుపై హర్యానా గవర్నర్ దత్తాత్రేయ అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గోల్కొండ కోటలో కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు తనను ఆహ్వానించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించిన దత్తాత్రేయ.. తాను హైదరాబాద్‌లో ఉన్న విషయం తెలిసి కూడా తనను ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఉద్యమంలో తాను చుకురుగా పాల్గొన్నానని.. తాను ఓ ఉద్యమకారుడినే కాక ప్రస్తుతం ఓ రాష్ట్రానికి గవర్నర్‌ హోదాలో ఉన్న వ్యక్తినని అన్నారు. అలాంటిది తనను గుర్తించకపోవడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read..

రాష్ట్ర ఆవతరణ వేడుకల్లో మంత్రి కిషన్ రెడ్డికి నిరసన సెగ!


Next Story

Most Viewed