‘బజరంగ్ దళ్‌పై నిషేధం.. ఆ పార్టీ మెప్పు కోసమే!’

by Disha Web Desk 4 |
‘బజరంగ్ దళ్‌పై నిషేధం.. ఆ పార్టీ మెప్పు కోసమే!’
X

దిశ, డైనమిక్ బ్యూరో: భజరంగ్‌దళ్‌పై నిషేధం, ఆరెస్సెస్‌పై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు.. ఇవన్నీ ఎంఐఎం వంటి పార్టీల అనుకూలత కోసమే అని ప్రజలు కూడా తప్పక ఆలోచన చేస్తారని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ ప్రకటనను యూపీఏ భాగస్వాములుగా ఉందామనుకుంటున్న ఎన్ని రాజకీయ పార్టీలు సమర్ధిస్తాయో వారే తెలియజేయాలని తెలిపారు. భజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రస్తావించడం ఎంతవరకు సమంజసమో ఆ పార్టీ విశ్లేషించుకోవడం అత్యంత ఆవశ్యకమని శుక్రవారం ట్విట్టర్ వేదికగా తెలిపారు.

హిందువులు విశ్వసించే భావాలకు, నమ్మకాలకు వ్యతిరేక నిర్ణయాలను ప్రకటిస్తున్న కాంగ్రెస్‌ని, మెజారిటీ ప్రజలు అనుమానించవలసిన పరిస్థితిని ఆ పార్టీ స్వయంగా సృష్టించుకుంటున్నదని పేర్కొన్నారు. నిజానికి ప్రజలలో విభజన సృష్టించడమే బీజేపీ విధానమైతే.. నేడు దేశమంతా ఆత్యధికంగా ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధుల రూపంలో పరిపాలన బాధ్యతలలో ఉండదన్నారు. వాస్తవాలు చెబుతున్నదని కాబట్టి వారికి అంతే అనిపిస్తున్నదని వివరించారు.

Next Story

Most Viewed