ఎన్టీఆర్‌కు భారతరత్న డిమాండ్.. ఇంకెవరికిస్తారంటూ బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
ఎన్టీఆర్‌కు భారతరత్న డిమాండ్.. ఇంకెవరికిస్తారంటూ బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ టీటీడీపీ నిర్వహించిన మినీ మహానాడులో కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ ఈ కార్యక్రమాని ముఖ్య అతిథిగా హాజరైన బాలయ్య మాట్లాడుతూ.. కోట్ల మంది గుండె చప్పుడు ఎన్టీఆర్ అని.. ఆయన యువతకు స్ఫూర్తి అని ప్రశంసలు కురిపించారు. భారత అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఎన్టీఆర్‌కు కాకుండా ఇంకెవరికి ఇస్తారని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలంటూ ఈ సందర్భంగా నందమూరి కుటుంబ, టీడీపీ, ఆయన అభిమానుల తరుఫున డిమాండ్ చేస్తున్నన్నారు. టీడీపీ తెలంగాణ ప్రజల గుండెల్లో గూడు కట్టుకుని ఉందని అన్నారు.

వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో తెలంగాణలో సత్తా చాటుతామని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ అనే తేడా లేకుండా అన్నదమ్ములుగా కలిసే ఉందామని పిలుపునిచ్చారు. ఒక కార్యకర్తగా, ఎమ్మెల్యేగా టీడీపీ బలోపేతానికి కృషి చేస్తున్నానని.. కానీ పార్టీ కార్యక్రమాల్లో నన్ను అతిథిగా చెప్పడం భావ్యం కాదని వ్యాఖ్యానించారు. ఇక, హైదరాబాద్‌లో తెలంగాణ టీడీపీ మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించింది. పొలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ ఆధ్వర్యంలో మినీ మహానాడు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని అరవింద్ కుమార్ గౌడ్ తీర్మానం ప్రవేశపెట్టారు.

Also Read..

వంద కోట్ల క్లబ్ చేరువలో ‘విరూపాక్ష’



Next Story

Most Viewed