- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తీన్మార్ మల్లన్నకు బెయిల్.. రేపు జైలు నుంచి విడుదల!
క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్నకు బెయిల్ మంజూరు అయింది. ఎస్వోటీ పోలీసులు, సాయి కిరణ్ గౌడ్ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ మల్కాజ్ గిరి కోర్టు సోమవారం తుది తీర్పు ఇచ్చింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్నకు బెయిల్ మంజూరు అయింది. ఎస్వోటీ పోలీసులు, సాయి కిరణ్ గౌడ్ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ మల్కాజ్ గిరి కోర్టు సోమవారం తుది తీర్పు ఇచ్చింది. మల్లన్నతో పాటు అరెస్ట్ అయిన మిగతా నలుగురికి సైతం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత నెలలో అరెస్ట్ అయిన తీన్మార్ మల్లన్న 28 రోజులు చర్లపల్లి జైల్లోనే ఉన్నారు. ఈ క్రమంలో మల్లన్న బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోగా కోర్టు ఇరువైపుల వాదనలు విన్న అనంతరం మల్లన్న అండ్ టీమ్ కు బెయిల్ మంజూరు చేసింది. దీంతో రేపు మల్లన్న జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా మల్లన్నపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు కేసులు నమోదు అయ్యాయి.
Also Read..
Next Story






