నిలోఫర్​నర్సింగ్ సూపరింటెండెంట్‌కు అవార్డు

by Disha Web Desk 2 |
నిలోఫర్​నర్సింగ్ సూపరింటెండెంట్‌కు అవార్డు
X

దిశ, తెలంగాణ బ్యూరో: నిలోఫర్​గ్రేడ్–​2 నర్సింగ్ సూపరింటెండెంట్​కె.పుష్పకు నర్సింగ్ అవార్డు ఆఫ్​ఎక్సలెన్స్​లభించింది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఢిల్లీ హెడ్‌క్వాటర్స్‌లో శుక్రవారం నిర్వహించిన సమార్పన్ దివస్ కార్యక్రమంలో ఈ అవార్డును కేంద్రమంత్రి డాక్టర్ ముంజపర మహేంద్రబాయ్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ శారద్ కేఆర్ అగర్వాల్, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దిలీప్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా కె.పుష్ప మాట్లాడుతూ.. ఈ అవార్డు తెలంగాణ రాష్ట్ర నర్సింగ్ సమాజానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. గడిచిన 38 సంవత్సరాల సర్వీసులో ఎంతో మంది రోగులకు సేవలు అందించినట్లు గుర్తు చేసుకున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్​రావు, నిలోఫర్​సూపరింటెండెంట్ డాక్టర్​ఉషారాణి ఆధ్వర్యంలో నిలోఫర్​ఆస్పత్రిలో సేవలందిస్తున్నట్లు తెలిపారు.

Next Story

Most Viewed