- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నిలోఫర్నర్సింగ్ సూపరింటెండెంట్కు అవార్డు
దిశ, తెలంగాణ బ్యూరో: నిలోఫర్గ్రేడ్–2 నర్సింగ్ సూపరింటెండెంట్కె.పుష్పకు నర్సింగ్ అవార్డు ఆఫ్ఎక్సలెన్స్లభించింది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఢిల్లీ హెడ్క్వాటర్స్లో శుక్రవారం నిర్వహించిన సమార్పన్ దివస్ కార్యక్రమంలో ఈ అవార్డును కేంద్రమంత్రి డాక్టర్ ముంజపర మహేంద్రబాయ్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ శారద్ కేఆర్ అగర్వాల్, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దిలీప్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా కె.పుష్ప మాట్లాడుతూ.. ఈ అవార్డు తెలంగాణ రాష్ట్ర నర్సింగ్ సమాజానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. గడిచిన 38 సంవత్సరాల సర్వీసులో ఎంతో మంది రోగులకు సేవలు అందించినట్లు గుర్తు చేసుకున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు, నిలోఫర్సూపరింటెండెంట్ డాక్టర్ఉషారాణి ఆధ్వర్యంలో నిలోఫర్ఆస్పత్రిలో సేవలందిస్తున్నట్లు తెలిపారు.