Terror Attack: ఆస్ట్రేలియా ఉగ్రదాడి.. నిందితులను గుర్తించిన దర్యాప్తు బృందం

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-15 02:19:37  IST  )

ఆస్ట్రేలియా (Australia)లోని సిడ్నీ (Sydney)లో యూదులపై జరిగిన ఉగ్ర దాడి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

Terror Attack: ఆస్ట్రేలియా ఉగ్రదాడి.. నిందితులను గుర్తించిన దర్యాప్తు బృందం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియా (Australia)లోని సిడ్నీ (Sydney)లో యూదులపై జరిగిన ఉగ్ర దాడి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. బాండీ బీచ్‌ (Bondi Beach)లో ఉత్సవం జరుపుకుంటున్న వారిపై ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో మొత్తం 16 మంది మరణించగా.. 38 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరు పోలీసు అధికారులు కూడా ఉన్నారు. అయితే, ఈ ఉగ్ర ఘటనపై అక్కడి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. బీచ్‌లో జరిగిన ఉగ్రదాడి తండ్రీకొడుకుల పనే అని దర్యాప్తు బృందాలు గుర్తించాయి. నిందితులు సాజిద్‌ అక్రమ్‌ (50), అతని కుమారుడు నవీద్‌ అక్రమ్‌ (24) కాల్పులకు పాల్పడినట్లు నిర్ధారించారు. సాజిద్‌ పండ్ల దుకాణం నిర్వహిస్తూ ఈ కాల్పులకు పాల్పడ్డాడు.

Next Story