ఔరంగబాద్ నేతలు బీఆర్ఎస్‌లో చేరిక

by Disha Web Desk 9 |
ఔరంగబాద్ నేతలు బీఆర్ఎస్‌లో చేరిక
X

దిశ, తెలంగాణ: మహారాష్ట్రలోని ఔరంగబాద్ నియోజకవర్గానికి చెందిన ఎన్సీపీ నేతలు బీఆర్ఎస్‌లో చేరారు. ఆదివారం ప్రగతిభవన్ లో ఎన్సీపీ ఉపాధ్యక్షుడు సయ్యద్ అబ్దుల్ ఖదీర్ మౌలానా తో పాటు పలువురు మైనార్టీ నేతలకు సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్గులాబీ కండువా కప్పి సాధరంగా ఆహ్వానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ లో అన్ని వర్గాలకు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులమై చేరుతున్నట్లు నేతలు ప్రకటించారు. ఈ సందర్బంగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మహారాష్ట్ర రైతు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే శంకర్ అన్నా ధోంగే, వైజాపూర్ విధానసభ నియోజకవర్గ నాయకుడు అభయ్ పాటిల్, చిక్కగాంకర్ సాహెబ్, దళిత యువజన నాయకుడు ఏవీన్ష్ వస్మత్, ప్రహ్లాద్ రాఖోండే సాహెబ్, గోరఖ్ పాటిల్, శ్యామ్ కదమ్, గోవింద్ ధెంబారే, దేవానంద్ పాటిల్, తుకారాం సాల్వే, చంద్రవిలాస్ తొంబరే పాటిల్, గజానన్ కదమ్,సంతోష్ పాటిల్,యువనేత ప్రవీణ్ జెతెవాడ్ తదితరులు పాల్గొన్నారు.


Next Story