- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఈనెల 23 నుంచి 27వరకు జరిగిన చిన్న తరహా ఖనిజ బ్లాకుల వేలం మొదటి దశ విజయవంతంగా పూర్తి అయింది. 10 సంవత్సరాల తరువాత సహాజ వనరుల పారదర్శకత, న్యాయోచిత, సమర్థవంతమైన కేటాయింపులు నిర్దారించడానికి ప్రదాన ఖనిజాల కోసం వేలం ఆదారిత కేటాయింపు జరిగింది. సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు త్వరతగతిని, పారదర్శకంగా గనులు భూగర్భశాఖ 19 బ్లాకుల వేలం నిర్వహించింది. కలర్గ్రానైట్ఒక బ్లాకు 3.63 హెక్టార్లు, లాటరైట్ 4 బ్లాకులు15.834 హెక్టార్లు, స్టోన్, మెటల్ 14 బ్లాక్లు, 47.125 హెక్టార్లు, బిడ్ప్రీమియం రూ. 56.74 కోట్ల ఉంది.
వేలం ప్రారంభానికి ముందు సాంకేతిక మూల్యాంకన కమిటీ, లావాదేవీల సలహాదారు నియామకం, ఈ వేలం పోర్టల్ప్రొవైడర్ఎంపిక, టెండర్, ఈఎండీ చెల్లింపుల డిజిటలైజేషన్, ప్రీ ఎంబెడెడ్బ్లాక్స్విధానం రూపొందించారు. మొదటి విడుత వేలం విజయవంతం కావడంతో ఇక నుంచి ప్రతినెలా విడుతల వారీగా వేలం నిర్వహించాలని గనుల శాఖ యోచిస్తోంది.
- Tags
- Mines






