దారుణం.. అస్తికోసం తండ్రిపై కత్తితో దాడి చేసిన కొడుకు

by Disha Web Desk 4 |
దారుణం.. అస్తికోసం తండ్రిపై కత్తితో దాడి చేసిన కొడుకు
X

దిశ ,మహబూబాబాద్ ప్రతినిధి : డబ్బుకోసం కుటుంబ సభ్యులనే కడతేర్చే కాలం చూడాల్సి వస్తోంది. కుటుంబం అంటే ఆత్మీయత అనురాగం అనేవి ఈ కాలంలో కరువయ్యాయి. డబ్బు, ఆస్తి వుంటే చాలు ఎవరున్న లేకున్నదాంతో బతికేయెచ్చనే ఆలోచనతో ఉన్నారు. ఆస్తికోసం కన్నతల్లిదండ్రులను, భార్యను, కన్నకొడుకును, అత్తమామను ఇలా రక్తసంబంధం అని చూడకుండా చంపేందుకు ఈ రోజుల్లో వెనుకడాటం లేదు. ఇలాంటి ఘటనే మహబూబాబాద్ జిల్లా తొర్రుర్ ఆర్టీసీ బస్ స్టేషన్‌లో ఆదివారం జరిగింది. ఆస్తికోసం కన్న తండ్రినే హత్య చేసేందుకు సిద్ధపడ్డాడు ఓ కొడుకు. తండ్రి రాములు‌పై కొడుకు స్వామి కత్తితో దాడికి దిగాడు. వివరాలోకి వెళ్తే.. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని టిక్యా తండాకు చెందిన మలోత్ రాములుకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుతూరులు ఉన్నారు.

వీరిలో పెద్ద కొడుకు శంకర్ నాయక్ చిన్న కొడుకు స్వామి. అయితే రాములుకు సుమారు రూ. నాలుగైదు కోట్ల ఆస్తి ఉండటంతో ఆస్తి మొత్తం నాకే కావాలని చిన్న కొడుకు స్వామి తండ్రి‌పై కత్తితో దాడికి దిగాడు. గత కొంత కాలంగా ఆస్తి తన పేరు‌పై రాయాలని స్వామి తండ్రిపై ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంట్లో నాలుగు రోజుల నుండి ఆస్తి వివాదం జరుగుతున్నట్లు తెలిసింది. వివాదం కాస్తా తారా స్థాయికి చేరుకోవడంతో తండ్రి‌పై కొడుకు స్వామి కత్తితో దాడి చేయడంతో రాములు మెడ, తలపై తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని 108 అంబులెన్సులో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఎస్సై లింగారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed