ఆవిర్భావ వేళ.. ఏఎన్ఎంలు, ఆశాలకు సర్కారు గుడ్ న్యూస్

by Disha Web Desk 4 |
ఆవిర్భావ వేళ..  ఏఎన్ఎంలు, ఆశాలకు సర్కారు గుడ్ న్యూస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ఏన్‌ఎంలకు బీపీ మిషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అత్యాధునిక టెక్నాలజీతో కూడి డిజిటల్ బీపీ పరికరాలను అందివ్వాలని ప్లాన్​చేసింది. ఒక్కో యంత్రం ఖర్చు సుమారు రూ.10 వేల వరకు ఉంటుందని ఆఫీసర్లు తెలిపారు. దీంతో పాటు ఆశా వర్కర్కర్లకు చీరలు పంపిణీ చేయనున్నారు. ఆవిర్భావ దినోత్సవం రోజు సంబంధిత స్థాఫ్‌కు జిల్లాల వారీగా వీటిని అందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 9 వేల మంది ఏఎన్‌ఎంలు, ఉండగా, 37 వేల మందికి పైగా ఆశా వర్కర్లు ఉన్నారు. వీరందరికీ ఆవిర్భావ డే రోజు మిషన్లు, చీరలు ఇవ్వనున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా మిషన్లు, చీరలను పంపించినట్లు ఓ అధికారి తెలిపారు.

బీపీ, షుగర్ ​గుర్తింపు..?

బీపీ, షుగర్‌లను కంట్రోల్ చేస్తే ఇతర వ్యాధులేవీ ప్రబలకుండా ఉండేందుకు ఛాన్స్​ఉన్నదని డాక్టర్లు చెబుతున్నారు. దీంతో గతంలో లేని విధంగా ఇంటింటికీ బీపీ, షుగర్​టెస్టులు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం తీసుకున్నది. దీనిలో భాగంగానే డిజిటల్ బీపీ మిషన్లు కొనుగోలు చేశారు. ప్రస్తుతం కొన్ని మిషన్లు ఉన్నప్పటికీ వాటిలో మ్యాన్​వల్ మెథడ్‌లో టెస్టుల ప్రక్రియ ఉంటుంది. కానీ డిజిటల్ మిషన్లతో అతి తక్కువ కాలంలో ఎక్కువ మందికి టెస్టులు చేయొచ్చని వైద్యాధికారులు చెబుతున్నారు.



Next Story

Most Viewed