అసెంబ్లీని 25 రోజులు నిర్వహించాలి: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

by Disha Web Desk 2 |
అసెంబ్లీని 25 రోజులు నిర్వహించాలి: ఎమ్మెల్యే జగ్గారెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: బడ్జెట్ బడ్జెట్ సమావేశాలను 25 రోజుల పాటు నిర్వహించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు, నిరుద్యోగం, రైతు సమస్యల పై చర్చ జరగాలని కోరారు. సీఎల్పీ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ పై డిస్కషన్ కు ఆరు రోజులు కేటాయించాలన్నారు. సమస్యలపై చర్చించడానికి మరో 18 రోజులు సభను నిర్వహించాలన్నారు. అప్పుడే సభ్యులందరికీ మాట్లాడే అవకాశం లభిస్తుందన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూరుకుపోయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ తోపాటు స్కామ్ లో ఉన్న వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ గవర్నర్ బయట ప్రభుత్వంపై పులిలా గాండ్రించి, అసెంబ్లీ లో పిల్లిలా ప్రసంగించారని విమర్శించారు. ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చడం సరికాదన్నారు.

Next Story

Most Viewed