- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం కేసీఆర్ను కలిసిన ఓవైసీ.. కూతురి పెళ్లికి రావాలని ఆహ్వానం
దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఎంఐఎం పార్టీ చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కలిశారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఎంఐఎం పార్టీ చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కలిశారు. గురువారం ఢిల్లీలోని కేసీఆర్ నివాసానికి ఓవైసీ వెళ్లారు. ఈ నేపథ్యంలో తన కూతురి పెళ్లికి రావాలని సీఎం కేసీఆర్కు ఆహ్వాన పత్రిక ఇచ్చిన ఓవైసీ మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. అంతేకాకుండా జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీసు ప్రారంభించినందుకు సీఎం కేసీఆర్కు అసదుద్దీన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇక, బీఆర్ఎస్ ఆఫీసు ప్రారంభోత్సవానికి వెళ్లిన సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో బిజిబిజీగా ఉన్నారు.
Next Story






