గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ ఆలీ ఖాన్

by Disha Web Desk 2 |
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ ఆలీ ఖాన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్టు అమీర్ ఆలీ ఖాన్ నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళిన ప్రతిపాదనలను పరిశీలించిన గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదం తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, గవర్నర్ మధ్య బుధవారం సాయంత్రం సమావేశమైన తర్వాత వెంటనే రాజ్‌భవన్ నుంచి నిర్ణయం వెలువడడం గమనార్హం. గవర్నర్ నామినేటెడ్ కోటాలో ప్రముఖ విద్యావంతులు ప్రొఫెసర్ కోదండరాం, సియాసత్ పత్రిక మాజీ సంపాదకులు జహీర్ ఆలీఖాన్ కుమారుడైన జర్నలిస్టు అమీర్ అలీఖాన్ పేర్లను మంత్రివర్గం ఆమోదంతో ప్రభుత్వం రాజ్‌భవన్ ఆమోదం కోసం పంపింది. గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీరిద్దరూ ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు.



Next Story

Most Viewed