మంగ్లీ కేసులో మరో ట్విస్ట్.. పోలీస్ స్టేషన్‍కు వచ్చిన అడ్వకేట్ సుబ్బారావుకు ఆల్కహాల్ పాజిటివ్

by Prasad Jukanti |

సింగర్ మంగ్లీ కేసులో పంజాగుట్ట పీఎస్‌కు వచ్చిన అడ్వకేట్ సుబ్బారావుకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ లో ఆల్కహాల్ రీడింగ్ పాజిటివ్ రావడం సంచలనంగా మారింది.

మంగ్లీ కేసులో మరో ట్విస్ట్.. పోలీస్ స్టేషన్‍కు వచ్చిన అడ్వకేట్ సుబ్బారావుకు ఆల్కహాల్ పాజిటివ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మైక్రో ఫైనాన్స్ స్కామ్ ఆరోపణల విషయంలో ప్రముఖ సింగర్ మంగ్లీ (Singer Mangli) వర్సెస్ అడ్వకేట్ సుబ్బారావు (Advocate Subba Rao) మధ్య నడుస్తున్న వివాదంలో రోజుకో ట్విస్ట్ నమోదవుతోంది. అడ్వకేట్ సుబ్బారావు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారంటూ న్యాయవాది సింగపోగు సుబ్బారావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో (Panjagutta Police Station) నిన్న మంగ్లీ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తనపై మంగ్లీ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఇవాళ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‍కు వచ్చిన అడ్వకేట్ సుబ్బారావుకు బ్రీత్ ఎనలైజర్ టెస్టులో పాజిటివ్ రావడం హాట్ టాపిక్‍గా మారింది. 27 శాతం ఆల్కహాల్ రీడింగ్ నమోదు కావడం, ఈ క్రమంలో అక్కడ పోలీసులు, సుబ్బారావు మధ్య వాగ్వాదం జరగడంతో పీఎస్‍లో కాసేపు హైడ్రామా నడిచింది.

వాసన రావడంతో టెస్ట్:

సింగర్ మంగ్లీ కేసుకు సంబంధించి బాధితులతో కలిసి వచ్చిన ఒక అడ్వకేట్‌ సుబ్బారావు పంజాగుట్ట పీఎస్‍కు వచ్చారు. ఈ క్రమంలో మీడియాతో కలిసి పీఎస్ లోపలికి వెళ్లేందుకు ఆయన ప్రయత్నం చేశారు. అయితే మద్యం వాసన రావడంతో సుబ్బారావును అడ్డుకున్న పోలీసులు అక్కడే ఆల్కహాల్ పరీక్ష నిర్వహించారు. ఈ టెస్ట్ లో 27 శాతం రీడింగ్ నమోదు కావడంతో అతను ఆల్కహాల్ సేవించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. నిబంధనల ప్రకారం నమోదైన రీడింగ్ పాయింట్లతో అతడు డ్రైవింగ్ చేసేందుకు ఎలిజిబుల్ ఉంటుందన్నారు. పరిమితికి లోబడి పాయింట్లు నమోదు అయినందున కేవలం ఆయనకు వివరించడానికి ప్రయతించామని ఆయనే తమతో వాదనకు దిగాడని పోలీసులు తెలిపారు.

తప్పుదోవ పట్టించే ప్రయత్నం:

అయితే తాను రాత్రి మద్యం సేవించడం వల్లే ఇప్పుడు రీడింగ్ చూపిస్తోందని సుబ్బారావు అన్నారు. ఈ కేసులో తనను భయపెట్టి, మభ్యపెట్టే ప్రయత్నాల్లో భాగంగానే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. నేను మద్యం సేవించి వాహనం నడపలేదని చెప్పారు. అడ్వకేట్‍కు అనుమతి లేకుండా ఎలా టెస్ట్ చేస్తారని పోలీసులను ప్రశ్నించారు. నేను సాధారణ వ్యక్తిని కాదని నేను అడ్వకేట్ ను నన్ను బెదిరించే ప్రయత్నం చేయవద్దని పోలీసులతో వాదనకు దిగారు. దీంతో తాగి వాహనం నడిపితేనే టెస్ట్ చేయరని, మద్యం సేవించి పబ్లిక్ ప్లేస్ లోకి వస్తే టెస్టులు చేసే అవకాశం ఉంటుందని పోలీసులు తెలిపారు. దీంతో కాసేపు అక్కడ పోలీసులు, సుబ్బారావు మధ్య వాగ్వాదం నడిచింది.

Next Story