BREAKING: మరో ట్రావెల్స్ బస్సు ప్రమాదం..

by Ramesh Naini |   (  Updated:2025-11-30 03:36:37  IST  )

తెలంగాణలో మరో ట్రావెల్స్ బస్సు ప్రమాదం కలకలం రేపుతోంది.

BREAKING: మరో ట్రావెల్స్ బస్సు ప్రమాదం..
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో మరో ట్రావెల్స్ బస్సు ప్రమాదం కలకలం రేపుతోంది. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుప్టీ ఘాటు వద్ద ఆదివారం తెల్లవారుజామున భయానక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వచ్చిన లారీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. దాంతో ఇద్దరు ఘటనాస్థలిలోనే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రగాయాలైనట్లు సమాచారం. స్థానికులు సంఘటనను గమనించి వెంటనే సమాచారంతో పోలీసులకు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు, ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story