- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
TSPSC కేసులో 43కు చేరిన అరెస్టుల సంఖ్య.. కొత్తగా అరెస్ట్ అయిందెవరంటే?
by Disha Web Desk 2 |
X
దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ కేసులో తాజాగా మరొకరిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. సతీష్ కుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రూ.3 లక్షలకు ఏఈ పేపర్ ను సతీష్ కుమార్ కొనుగోలు చేసినట్లు సిట్ గుర్తించింది. ఈ లీకేజీ కేసులో ఈనెల 24న అరెస్ట్ అయిన రవి కిశోర్ వద్ద నుంచి సతీష్ ఏఈ పేపర్ కొనుగోలు చేశాడని సిట్ గుర్తించింది. దీంతో టీఎస్ పీఎస్సీ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య 43 కు చేరింది. ఈ కేసులో మరి కొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈకేసులో అరెస్టులు పూర్తయి విచారణ ముగింపు దశకు వచ్చిందా అనే చర్చ జరుగుతున్న వేళ తాజాగా చోటు చేసుకుంటున్న అరెస్టులు ఈ కేసు దర్యాప్తుపై ఉత్కంఠ పెంచుతోంది. విచారణ పూర్తయ్యే నాటికి ఈ కేసులు మరెన్ని ట్విస్టులు తీసుకుంటుందో అనే చర్చ జరుగుతోంది.
Next Story