కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మరో కొత్త అంశం..

by Sathputhe Rajesh |   (  Updated:2023-10-25 14:07:08  IST  )

ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో మరో కొత్త అంశాన్ని చేర్చింది.

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మరో కొత్త అంశం..
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో మరో కొత్త అంశాన్ని చేర్చింది. పంచాయతీ వార్డు సభ్యులకు గౌరవ వేతనం అంశంలో మేనిఫెస్టో కమిటీలో ప్రతిపాదనలు చేసినట్లు తెలిపింది. ఈ మేరకు గాంధీ భవన్‌లో బుధవారం టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ సమావేశం మంథని ఎమ్మెల్యే, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన జరిగింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక.. రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీ సభ్యులకు గౌరవ వేతనం ఇవ్వాలని ప్రతిపాదించారు.

Next Story