గొర్రెల స్కీమ్ కుంభకోణం కేసులో మరో BIG ట్వి్స్ట్

by Disha Web Desk 2 |
గొర్రెల స్కీమ్ కుంభకోణం కేసులో మరో BIG ట్వి్స్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. అవకతవకల్లో మరో జాయింట్ డైరెక్టర్ హస్తం ఉన్నట్లు వార్తలు విస్తృతమయ్యాయి. ఈ కేసులో ఇప్పటికే నలుగురు అధికారులను అరెస్ట్ చేసిన ఏసీబీ మూడ్రోజుల పాటు సుదీర్ఘంగా విచారించింది. ఈ విచారణలో జాయింట్ డైరెక్టర్ పాత్ర బయటపడింది. రికార్డుల్లోకి బినామీ ఖాతాల వివరాలు ఎక్కించినట్లు నిర్ధారించారు. మొయినుద్దీన్ నుంచి రూ.లక్షలు తీసుకున్నట్లు గుర్తించడమే కాకుండా.. ఆయనకు నోటీసులు ఇవ్వడానికి ఏసీబీ సిద్ధమైంది.

కాగా, గొర్రెల పంపిణీ పథకం కుంభంకోణం కేసులో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. ఇప్పటికే అదుపులోకి తీసుకున్న నలుగురు నిందితుల కస్టడీ ముగిసింది. వారిని మూడురోజులు విచారించిన ఏసీబీ అధికారులు వారి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. రెండు కోట్ల రూపాయలు ప్రైవేట్ ఖాతాలోకి దారి మళ్లించిన దానిపై ఆరా తీశారు. కస్టడీ ముగియడంతో నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

Next Story

Most Viewed