హైదరాబాద్‌లో ఎయిర్‌ ఇండియా విమానంలో సాంకేతిక లోపం!

by Ajay Maddhiboyina |

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదాన్ని ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. ఈ ప్రమాదంలో 260 మంది అక్కడికక్కడే కన్నుమూసిన సంగతి తెలిసిందే.

హైదరాబాద్‌లో ఎయిర్‌ ఇండియా విమానంలో సాంకేతిక లోపం!
X

దిశ, వెబ్ డెస్క్: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదాన్ని ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. ఈ ప్రమాదంలో 260 మంది అక్కడికక్కడే కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం ప్రపంచంలో జరిగిన విమాన ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది. అయితే ఈ ప్రమాదం తరవాత జాగ్రత్తలు తీసుకున్నా ఎయిర్ ఇండియా విమానాల్లో సంకేతిక లోపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. చిన్న సమస్య వచ్చినా ఎయిర్ ఇండియా విమానాలను వెంటనే నిలిపివేస్తున్నారు. తాజాగా మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించారు. హైదరాబాద్ నుండి ఫుకెట్ వెళుతున్న విమానంలో సమస్యలు ఉన్నట్టు సిబ్బంది గుర్తించారు. టేకాఫ్ అయిన వెంటనే సమస్యను గుర్తించిన పైలట్ విమామాన్ని తిరిగి హైదరాబాద్ లో ల్యాండ్ చేశారు.

Next Story