కొత్త మంత్రులకు శాఖలు కేటాయిస్తూ ప్రకటన

by Muthe.Rajitha |   (  Updated:2025-06-11 16:44:38  IST  )

తెలంగాణలో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపు అంశం కొలిక్కివచ్చింది.

కొత్త మంత్రులకు శాఖలు కేటాయిస్తూ ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు మంత్రులకు శాఖల కేటాయింపు అంశం కొలిక్కివచ్చింది. గడ్డం వివేక్‌ వెంకటస్వామికి (Gaddam Vivek) కార్మిక, ఉపాధి, శిక్షణ& కర్మాగారాలు, గనులు మరియు భూగర్భ శాస్త్ర శాఖలు కేటాయించారు. అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు (Adluri Laxman) షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, గిరిజన, మైనారిటీల సంక్షేమం, వికలాంగులు, సీనియర్ సిటిజన్లు మరియు లింగమార్పిడి వ్యక్తుల సాధికారత శాఖ శాఖలు కేటాయించారు. వాకిటి శ్రీహరికి (Vakiti Srihari) పశుసంవర్ధకం, పాడి పరిశ్రమ అభివృద్ధి & మత్స్య సంపద, క్రీడలు& యువజన సేవల శాఖలు కేటాయిస్తూ ప్రకటన విడుదలైంది. వీరంతా రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు సెక్రటేరియట్ చాంబర్లు సిద్ధం అయ్యాయి.

Next Story