హైదరాబాద్ ఓటర్లకు అల్లు అరవింద్ అదిరిపోయే పంచ్!

by Sathputhe Rajesh |

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

హైదరాబాద్ ఓటర్లకు అల్లు అరవింద్ అదిరిపోయే పంచ్!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, వెంకటేశ్ సహ పలువురు తమ ఓటు వేశారు. ఇక, ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ జూబ్లీహిల్స్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. అనంతరం అల్లు అరవింద్ మాట్లాడారు. హైదరాబాద్ ఓటర్లందరూ హాలీడే కదా అని బీరు తాగి ఇంట్లో పడుకునే వారు చాలా మంది ఉన్నారు. అలా చేస్తే ఎమ్మెల్యేను ప్రశ్నించే హక్కు వారికి ఉండదన్నారు. అందరూ లేచి వచ్చి ఓటు వేయండన్నారు. ఓటు వేయడం మన బాధ్యత అని అన్నారు.

Next Story