న్యూ ఇయర్ వేడుకల ఎఫెక్ట్.. ఒక్కటి లేకుండా ఆ రూములన్నీ బుక్..!

by Disha Web Desk 2 |
న్యూ ఇయర్ వేడుకల ఎఫెక్ట్.. ఒక్కటి లేకుండా ఆ రూములన్నీ బుక్..!
X

దిశ, వెబ్‌డెస్క్: నూతన సంవత్సర వేడుకలకు ప్రపంచం సిద్ధమైంది. గత సంవత్సర జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ చిల్ అవ్వడానికి అంతా రెడీ అయ్యారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ వేడుకలకు యువత ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి వయో భేదం లేకుండా సిద్ధమయ్యారు. న్యూ ఇయర్‌ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించినా అనుమతులతో గెస్ట్ హౌజ్‌, ఫామ్ హౌజ్‌లలో ఎంజాయ్ చేయడానికి సిద్ధమవుతున్నారు.

ఈ క్రమంలోనే కొందరు నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ వద్ద భారీ వేడుకలకు ఏర్పా్ట్లు చేశారు. ఈ నేపథ్యంలో 20 రోజుల క్రితమే విజయవిహార్‌లోని అతిథి గృహాలన్నీ బుక్ అయ్యాయి. స్థానిక సిద్ధార్థ హోటల్‌తో పాటు సాగర్ డ్యామ్ అవతలివైపు నూతనంగా నిర్మించినన 40 గదులతో నిర్మించిన మాతా సరోవర్ రిస్టార్ట్స్‌తో పాటు చిన్నా చితక లాడ్జీలన్నీ పర్యాటకులతో కిటకిటలాడుతున్నాయి.

Next Story

Most Viewed