ప్రొటెమ్ స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణం

by Disha Web Desk 2 |
ప్రొటెమ్ స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శాసనసభ ప్రొటెమ్ స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళి సై అక్బరుద్దీన్ చేత ప్రొటెమ్ స్పీకర్‌గా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. అతంతరం అటునుంచి నేరుగా అసెంబ్లీకి చేరుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత అక్బరుద్దీన్ ప్రమాణం చేయించనున్నారు. కాగా, ప్రొటెమ్ స్పీకర్ అక్బరుద్దీన్ అయితే తాము ప్రమాణం చేయబోమని ఇప్పటికే ఎమ్మెల్యే రాజాసింగ్ తేల్చి చెప్పారు.


Next Story

Most Viewed