- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సంక్రాంతి తరువాత అందరికీ రైతుబంధు జమ చేస్తాం.. మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
దిశ, డైనమిక్ బ్యూరో: రైతుబంధుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సంక్రాంతి పండుగ తరువాత రైతులందరికీ రైతుబంధు అందుతుందని స్పష్టం చేశారు. బుధవారం ఖమ్మంలో మీడియాతో మాట్లాడిన మంత్రి.. రైతుబంధుపై ఎలాంటి అపోహలు వద్దని కోరారు. తమ ప్రభుత్వంలో నిజమైన అర్హులకు పథకాలు తప్పకుండా అందుతాయని పేర్కొన్నారు. రైతుబంధు నగదు విడతల వారీగా జమ అవుతున్న నేపథ్యంలో పెండింగ్లో ఉన్న రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండగ తర్వాత అందకి ఖాతాలో పడతాయని మంత్రి క్లారిటీ ఇచ్చారు. కాగా, గత సీఎం కేసీఆర్ కేవలం మాటలకే పరిమితం అయ్యారని, కానీ ప్రస్తుతం సీఎం రేవంత్రెడ్డి ద్వారా ప్రజల వద్దకు పథకాలు వెళుతున్నాయని తుమ్మల అన్నారు. అహంకారాన్ని ప్రజలు సహించరు అనడానికి తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పే నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రంలో కబ్జాల రాజ్యం పోవాలని ప్రజలు కోరుకున్నారని అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని తెలిపారు.