పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య

by Disha Web Desk 1 |
పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య
X

దిశ, లక్షెట్టిపేట: మండలంలోని జెండా వెంకటాపూర్ గ్రామానికి చెందిన పెట్టేం స్వప్న(25) వివాహిత పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందినట్లు స్థానిక ఎస్ఐ లక్ష్మణ్ తెలిపారు. గ్రామంలోని ఓ కుటుంబంతో తలెత్తిన గొడవలతో మనస్తాపానికి గురైన స్వప్న 31న ఇంట్లో పురుగుల మందు తాగింది. చికిత్స నిమిత్తం మంచిర్యాల ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లక్ష్మణ్ తెలిపారు.



Next Story

Most Viewed