గంజాయి మొక్కలు పట్టీవేత

by Nallavelli.Anjaneyulu |

దిశ, ఇంద్రవెల్లి : ఇంటి పెరట్లో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి మొక్కలు పండిస్తున్న ఒక్కరి పై కేసు నమోదు చేసిన ఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది. శుక్రవారం ఎస్సై సాయన్న

గంజాయి మొక్కలు పట్టీవేత
X

దిశ, ఇంద్రవెల్లి : ఇంటి పెరట్లో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి మొక్కలు పండిస్తున్న ఒక్కరి పై కేసు నమోదు చేసిన ఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది. శుక్రవారం ఎస్సై సాయన్న తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కేస్లాపూర్ గ్రామానికి చెందిన మెస్రం రాంజీ (29)తన ఇంటి పేరట్లో 3 గంజాయి చెట్లను సాగు చేస్తున్నాడని, పక్కా సమాచారం మేరకు గంజాయి సాగు చేస్తున్న ప్రదేశంలో సందర్శించి, గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గంజాయి మొక్కల విలువ సుమారు రూ. 30, 000 ఉంటుందన్నారు. ఈ మేరకు మెస్రం రాంజీ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story