త్రిబుల్ ఐటీ స్పెషల్.. నిన్నటి కర్రీలో కప్ప.. ఈ రోజు కర్రీలో తోక పురుగు..

by Dishanational2 |
త్రిబుల్ ఐటీ స్పెషల్.. నిన్నటి కర్రీలో కప్ప.. ఈ రోజు కర్రీలో తోక పురుగు..
X

దిశ, ముధోల్ : నిర్మల్ జిల్లా బాసర కేంద్రంలో గల త్రిబుల్ఐటీ విద్యాలయంలో శనివారం ఉదయం టిఫిన్ చేస్తున్న విద్యార్థులకు కర్రీలో కప్ప ప్రత్యక్షమైందని తెలిపిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఈ సంఘటనను విద్యార్థులు సెల్ ఫొన్‌లో టుడే స్పెషల్ చపాతీ విత్ ఆలూ ఫ్రాగ్ కుర్మా అంటూ కామెంట్ చేశారు. దీంతో పలుసామాజిక మధ్యమాలలో,సోషల్ మీడియాలో ఈ పోస్ట్ కాస్త హల్ చల్ అయింది.అయితే ఈ ఘటనకు సంబంధించిన పలు కారణాలను కనుక్కొంటామని సిబ్బంది తెలపగా, సరిగ్గా రోజు గడవకముందే మళ్లీ ఆదివారం ఉదయం వడ్డీంచిన కర్రీ‌లో తోక పురుగు ప్రత్యక్షం అయిందంటూ ఫోటోలు ప్రారంభంమయ్యయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు మెస్ నిర్వాహకులపై మండిపడుతున్నారు. ప్రాథమిక అవసరాల్లో ఒకటైన ఆహారం సరిగ్గా ఉన్నప్పుడే విద్యార్థులు చదవడానికి ఉత్సాహంచూపుతారని, అలాంటిది సరైన ఆహారం లేకుంటే విద్యార్థులు చదివేది ఎలా అంటూ ఆందోళన చెందుతున్నారు. కొందరు విద్యార్థినిలు తమ తల్లిదండ్రులకు ఫోన్‌లో సంభాషిస్తూ మెస్ నిర్వాహణ సరిగ్గా లేదంటూ, ఆహారం లో ఎప్పుడూ ఏదో ఒకటి ప్రత్యక్షమవ్వడంతో సరిగా తినలేకపోతున్నామని తమ బాధను వెళ్లబుచ్చుతున్నారు.


Next Story