జర పట్టించుకోండి సారు..

by Disha Web Desk 20 |
జర పట్టించుకోండి సారు..
X

దిశ, మంచిర్యాల టౌన్ : మంచిర్యాల పట్టణంలోని లక్ష్మి టాకీస్ చౌరస్తా నుండి హైటెక్ సిటీ నుంచి వెళ్ళే వంద ఫీట్ల రోడ్ లో ఇటీవల మిషన్ భగీరథ పైప్ లైన్ పగలడంతో మరమ్మత్తులు నిర్వహించారు. కానీ అప్పుడు ఏర్పడిన గుంతను మాత్రం పూడ్చడం మరిచారు. దాదాపు 20 రోజుల నుండి గుంతను పూడ్చక పోవడంతో అటుగా వెళ్ళే వాహనదారులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీ వాసులు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే లేడని వాపోతున్నారు. నిత్యం ఆ మార్గంలో వెళ్ళాలి అంటే భయంగా ఉందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి గుంతను పూడ్చాలని కోరుకుంటున్నారు.



Next Story

Most Viewed