బెల్లంపల్లి నూతన మార్కెట్ కమిటీ చైర్మెన్‌గా నిరంజన్ గుప్తా

by Dishanational1 |
బెల్లంపల్లి నూతన మార్కెట్ కమిటీ చైర్మెన్‌గా నిరంజన్ గుప్తా
X

దిశ, భీమిని: బెల్లంపల్లి నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ గా బోనగిరి నిరంజన్ గుప్తాను నియమిస్తున్నట్లు మంగళవారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మండల కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడుగా ఉన్నారు. పాత మార్కెట్ కమిటీ పాలకవర్గం కమిటీ సమయం ముగియడంతో నిరంజన్ గుప్తాను చైర్మన్ గా నియమించారు. త్వరలో బెల్లంపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గా నిరంజన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తనను బెల్లంపల్లి చైర్మన్ గా నియమించడం పట్ల బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు. నిరంజన్ నియామకం పట్ల పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Next Story

Most Viewed