ఇలా చేస్తే ప్రజల్లో మరింత చులకనైతారు: బాల్క సుమన్

by Web Desk |
ఇలా చేస్తే ప్రజల్లో మరింత చులకనైతారు: బాల్క సుమన్
X

దిశ, మంచిర్యాల: మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు ఇంటిపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ప్రభుత్వ విప్, జిల్లా అధ్యక్షుడు, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి భౌతిక దాడులకు తావులేదు.. ప్రజాప్రతినిధుల ఇళ్లపై దాడి చేయడం మంచి సంస్కృతి కాదన్న అన్నారు. ఇలాంటి దాడులు చేయడం వల్ల ప్రజల్లో మెప్పును పొందలేరు.. ప్రజల విశ్వాసాన్ని కూడగట్టలేరు.. ఇలాంటి దాడులను ప్రోత్సహించడం వల్ల ప్రజల్లో మరింత చులకన అవుతారు అని ఆయన అన్నారు.

Next Story

Most Viewed