శ్రీహరి రావుతో అద్దంకి భేటీ..!

by Disha Web Desk 20 |
శ్రీహరి రావుతో అద్దంకి భేటీ..!
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : భారత్ రాష్ట్ర సమితి పార్టీలో కొనసాగుతూనే నిర్మల్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు కే శ్రీహరి రావుతో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ సోమవారం సాయంత్రం నిర్మల్ లో భేటీ అయ్యారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తామని వెంటనే పార్టీలో చేరాలని శ్రీహరి రావును అద్దంకి దయాకర్ కోరినట్లు సమాచారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూతగా ఆయన నిర్మల్ కు వచ్చి శ్రీహరి నివాసంలో సుమారు రెండు గంటల పాటు సమావేశమయ్యారు. టికెట్ హామీతో పాటు పార్టీలో మంచి ప్రాధాన్యం కల్పిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చినట్లు తెలిసింది.

అయితే అధికార భారత రాష్ట్ర సమితి పార్టీలో కొనసాగుతున్న శ్రీహరి రావు ఇప్పటికిప్పుడే తానేమి నిర్ణయం తీసుకోలేదని కొంత టైం కోరినట్లు తెలిసింది. తాజాగా అద్దంకి దయాకర్ శ్రీహరిరావుతో భేటీ కావడం నిర్మల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారండి కర్ణాటక ఎన్నికల ఫలితాలుతో జోష్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను దింపే క్రమంలోని అధికార భారత్ రాష్ట్రసమితితో పాటు ఇతర పార్టీల్లో బలంగా ఉన్ననేతలతో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం ఇందులో భాగంగానే శ్రీహరి రావుతో అద్దంకి దయాకర్ భేటీ అయ్యారని తెలిసింది.


Next Story

Most Viewed