ఏసీబీకి చిక్కిన వ్యవసాయ మార్కెటింగ్ కార్యదర్శి..

by Disha Web Desk 20 |
ఏసీబీకి చిక్కిన వ్యవసాయ మార్కెటింగ్ కార్యదర్శి..
X

దిశ, మంచిర్యాల, మంచిర్యాల టౌన్ : లంచం తీసుకుంటూ మంచిర్యాల వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కార్యదర్శి కె. శారద సోమవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. కాటన్ ఆగ్రో ఏజెన్సీ లైసెన్స్ రెన్యువల్ కోసం విశ్వేశ్వర్ అనే స్థానిక వ్యాపారి నుంచి ఆమె రూ.ఒక లక్ష లంచం డిమాండ్ చేసింది.

బాధితుడు మొదటి దఫాగా రూ. 15వేలు ఆమెకి ఇచ్చాడు. అనంతరం ఏసీబీని ఆ వ్యాపారి ఆశ్రయించాడు. ఈ మేరకు వల పన్నిన ఏసీబీ అధికారులు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆఫీస్ లో వ్యాపారి నుంచి రెండో దఫాగా రూ.65వేల లంచం తీసుకుంటుండగా ఆమెను పట్టుకున్నారు.

Next Story

Most Viewed