- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెరుచుకుని లింబుగూడ పాఠశాల.. వ్యవసాయ పనుల్లో పిల్లలు
by Chintha Aamani |
మండలంలోని లింబుగూడ గిరిజన ప్రాథమిక పాఠశాల గురువారం తెరుచుకోలేదు.

X
దిశ, వాంకిడి : మండలంలోని లింబుగూడ గిరిజన ప్రాథమిక పాఠశాల గురువారం తెరుచుకోలేదు. అక్కడ పనిచేసే ఉపాధ్యాయులు విధులకు హాజరు కాకపోవడంతో ఉదయం 10 దాటిన పాఠశాల తాళం తీసే వారు లేకుండా పోయారు. దీంతో పాఠశాలకు వచ్చిన గిరిజన పిల్లలు తమ తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయ పనులకు వెళ్తున్నారు. ఈ విషయమై స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం సత్యనారాయణ ను ఫోన్ లో సంప్రదించగా పాఠశాల ఉపాధ్యాయులు సెలవుకు వెళ్ళిందని చెప్పారు. అయితే రెండు తరగతులకు ఒకే టీచర్ ఉండడం,ఆమె సెలవు పై వెళ్తే, పాఠశాల బంద్ ఉంటుందని, దీంతో తమ పిల్లలు చదువుకు దూరమవుతున్నారని తల్లిదండ్రులు వాపోయారు. ఎంఈవో చొరవ తీసుకుని ఉపాధ్యాయురాలు సెలవుకు వెళ్తే.. మరో ఉపాధ్యాయుడికి ఇక్కడ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించి పాఠశాల కొనసాగించేలా తగు చర్యలు తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
Next Story






