మునుగోడు ప్రచారంలో జిల్లా నాయకులు..

by Disha Web Desk 20 |
మునుగోడు ప్రచారంలో జిల్లా నాయకులు..
X

దిశ, నిర్మల్ కల్చరల్ : నల్గొండ జిల్లాలోని మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో నిర్మల్, సారంగపూర్, లక్ష్మణచందా, దిలావర్ పూర్ మండలాల టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొంటున్నారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని సర్వేయిల్, గుడిమల్కాపూర్ ప్రాంతాలలో టీఆర్ఎస్ నాయకులు బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

నారాయణపురం మండలంలోని సర్వేయిల్ గ్రామపంచాయతీలోని ఓటర్లను కలిసి టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా జరిగిన అబివృద్ధిని వివరించారు. టీఆర్ఎస్ అబ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సారంగపూర్, నిర్మల్ ఎంపీపీలు మహిపాల్ రెడ్డి, రామేశ్వర్ రెడ్డి, అడెల్లి ఆలయ చైర్మన్ ఆయిటి చందు, నాయకులు మారుగొండ రాము, మాధవరావు, టీఆర్ఎస్ జిల్లా కార్యదర్శి అడ్వాల రమేశ్, కొరిపెల్లి క్రిష్ణారెడ్డి, మార్కెట్ కమిటి డైరెక్టర్ గుర్రాల లింగారెడ్డి, గుజ్జరి గణేష్, కోండ్ర నరేష్ రెడ్డి, నాయకులు పాల్దే అనిల్, ఓడ్నం కృష్ణ, కాల్వ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed