బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిక

by Ratna Kumari |

దిశ, బెజ్జూర్ : బెజ్జూర్ మండ‌ల కుకుడా గ్రామానికి చెందిన బీజేపీ నాయ‌కుడు నామాని కృష్ణ‌య్య ప‌లువురు నాయ‌కుల‌తో క‌లిసి ఆదివారం ఉమ్మ‌డి

బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిక
X

దిశ, బెజ్జూర్ : బెజ్జూర్ మండ‌ల కుకుడా గ్రామానికి చెందిన బీజేపీ నాయ‌కుడు నామాని కృష్ణ‌య్య ప‌లువురు నాయ‌కుల‌తో క‌లిసి ఆదివారం ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠ‌ల్ స‌మ‌క్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ నాయకత్వంలో సిర్పూర్ నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమ‌ని.. అందుకే కాంగ్రెస్ లో చేరుతున్న‌ట్టు నామాని కృష్ణ‌య్య తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు వారు తెలిపారు. నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ బ‌లోపేతానికి క‌లిసి క‌ట్టుగా కృషి చేయాల‌ని కార్య‌క‌ర్త‌ల‌కు సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ జ‌డ్పీటీసీ స‌భ్యులు పంద్రం పుష్ప‌ల‌త‌, బ్లాక్ కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాచ‌కొండ శ్రీవార్ద‌న్, బెజ్జూర్ మండ‌ల కాంగ్రెస్ అధ్య‌క్షుడు కోడ్ప విశ్వేశ్వ‌ర్, యూత్ కాంగ్రెస్ మండ‌ల అధ్య‌క్షుడు రంగు సురేష్ గౌడ్, నాయ‌కులు మెరుగు ర‌మేష్, మ‌హేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Next Story