రైతులు ఈ నెల 8 లోపు రైతుబంధుకు దరఖాస్తు చేసుకోవాలి..

by Disha Web Desk 20 |
రైతులు ఈ నెల 8 లోపు రైతుబంధుకు దరఖాస్తు చేసుకోవాలి..
X

దిశ, లోకేశ్వరం : డిసెంబర్ 2022 లోపు కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందిన రైతులు రానున్న వానాకాలం సీజన్లో రైతుబంధు పెట్టుబడి సహాయం పొందేందుకు ఈనెల 8 గురువారం లోపు దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయశాఖ అధికారి గణేష్ తెలిపారు. లోకేశ్వరం మండలంలో డిసెంబర్ 2022 లోపు కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన రైతులు దాదాపు 200 మంది ఉన్నారని, వారు పట్టాదార్ పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా జిరాక్స్ పత్రాలను ఆయా క్లస్టర్ల ఏఈఓ లకు ఈనెల 8లోపు అందజేయాలని సూచించారు. వారికి రానున్న వానాకాలం సీజన్ కోసం ప్రభుత్వం నుండి రైతుబంధు డబ్బులు వస్తాయని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


Next Story

Most Viewed