చేనులో మంట‌లు ఆర్పే క్ర‌మంలో నిప్పంటుకొని రైతు మృతి

by Ratna Kumari |

చేనులో మంటలు ఆర్పే క్రమంలో నిప్పు అంటుకొని రైతు మృతి చెందిన ఘ‌ట‌న క‌న‌కాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది.

చేనులో మంట‌లు ఆర్పే క్ర‌మంలో నిప్పంటుకొని రైతు మృతి
X

దిశ‌, ల‌క్ష్మ‌ణ చందా : చేనులో మంటలు ఆర్పే క్రమంలో నిప్పు అంటుకొని రైతు మృతి చెందిన ఘ‌ట‌న క‌న‌కాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్ర‌కారం.. నిర్మల్ జిల్లా, లక్ష్మణచంద మండలం, కనకాపూర్ గ్రామానికి చెందిన మంద గంగన్న అనే రైతు (56) మంగళవారం ఉదయం తన చేనులో వృధాగా పడి ఉన్న మొక్క కర్రలకు నిప్పు పెట్టగా అది ఒకేసారి చెలరేగి పక్కకు ఉన్న వరి పంట వైపు వెళ్తున్న గ్రామంలో వరి పంటకు నిప్పు అంటుకుంటదని నిప్పుని ఆర్పి వేసే క్రమంలో భయభ్రాంతులకు గురై ప్రమాదవశాత్తు తన శరీరానికి నిప్పు అంటుకొని అక్కడికక్కడే మరణించాడు. మృతునికి ముగ్గురు కూతుర్లు కలరు. అతని భార్య రాజమణి ఫిర్యాదు మేరకు లక్ష్మణచంద ఎస్సై శ్రావణి ఘటన స్థలానికి చేరుకొని మృతుని శ‌వాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రావణి తెలిపారు.

Next Story